జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చెరువులో మునిగి రెండు ఎద్దులు మృతి చెందాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో బెదిరిన కాడెద్దులు... పరుగులు తీస్తూ దారి ప్రక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయాయి. కళ్లెదుటే నీట మునిగిప్రాణాలు కోల్పోతున్న ఎద్దులను రక్షించలేక కుమ్మరి రాముడు అనే రైతు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
చెరువులో కాడెద్దులు మృతి.. రైతు కుటుంబం కంటతడి
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని చెరువులో రెండు ఎద్దులు మునిగి మృతి చెందాయి. కళ్లెదుటే నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఎద్దులను రక్షించలేక రైతు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
చెరువులో మునిగి రెండు ఎద్దులు మృతి.. కంటతడి పెట్టిన రైతన్న