తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2020, 11:11 AM IST

ETV Bharat / jagte-raho

సెల్ఫీ తీసుకునే క్రమంలో జలపాతంలో పడి మృతి

అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కమల(26) ఇంజినీరింగ్ పూర్తి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో అట్లాంటా సమీపంలోని జలపాతంలో వద్ద ఈ ఘటన జరిగింది.

telugu-girl-dies-after-accidentally-fell-in-atlanta-waterfall-in-america
సెల్ఫీ తీసుకునే క్రమంలో జలపాతంలో పడి మృతి

అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు.

ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతంవద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్‌ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి :వేర్వేరు ప్రమాదాలు.. ముగ్గురు వ్యక్తులు మృతి

ABOUT THE AUTHOR

...view details