తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డీసీఎం ఢీకొని మహిళా హోంగార్డు మృతి

మైలార్​దేవ్​పల్లిలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. కూతుర్ని సాగనంపిన అనంతరం రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి వాహన చోదకుడిని అరెస్టు చేశారు.

By

Published : Feb 4, 2019, 2:37 PM IST

homeguard

accident
ఉద్యోగం చేస్తూ... సెలవులో ఇంటికి వచ్చిన కూతురుతో ఎప్పటిలాగే ఆనందంగా గడిపిందా తల్లి. వెళ్లిపోతానన్న కూతుర్ని సాగనంపేందుకు రోడ్డు వద్దకు వచ్చి ఆటో ఎక్కించి తిరుగు పయనమైంది. కానీ అవే చివరి క్షణాలని ఊహించలేదేమో...! రోడ్డు దాటుతుండగా మృత్యువు డీసీఎం రూపంలో ఆమెను కబళించింది. ఆ ఇంట విషాదం నింపింది.
రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ మహిళను డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు వాంబే కాలనీకి చెందిన సుజాతగా స్థానికులు గుర్తించారు. చార్మినార్ పోలీసుస్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసి.. వాహన చోదకుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details