తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : Dec 28, 2020, 12:17 PM IST

accident
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

ములుగు జిల్లా తాడ్వాయి ఏటూరునాగారం మార్గమధ్య అడవిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలంలోని అడవి సమీపంలో ఆగి ఉన్న లారీని గమనించకుండా వస్తున్న కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఇద్దరు కుమార్తెలు, కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు మంగపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పోతులూరి శ్రీనివాస్(50)గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:బెంగళూరు కేంద్రంగా దా'రుణా'లకు యత్నం.. నిందితులు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details