తెలంగాణ

telangana

మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి

By

Published : Oct 9, 2020, 7:31 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం సృష్టించాడు. పోలీసులపై దాడి చేసి గాయపరిచాడు. ఎట్టకేలకు... పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

psycho-attack-on-police-in-madireddipalli-chitthore-district
మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మాదిరెడ్డి పల్లెలో ఓ సైకో... వీరంగం సృష్టించాడు. భయభ్రాంతులకు గురైన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది... సురేశ్​ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా... పోలీసులపై తిరగబడ్డాడు.

ఎస్సైపై దాడి చేసి గాయపరిచాడు. ఎట్టకేలకు పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి

ఇదీచదవండి:మొక్కజొన్న చేనులో మట్టిగుంత.. భయాందోళనలో జనం

ABOUT THE AUTHOR

...view details