నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిపై రాచకొండ పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు. నిందితుడు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇతడు తరచూ ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం వల్ల పీడీ చట్టం నమోదు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ముఠాకు చెందిన ఇతర నేరగాళ్లపైనా గతంలోనే పీడీ చట్టం నమోదు చేసినట్లు వివరించారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లును రిమాండ్కు తరలించారు.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న పాత నేరస్థుడిపై పీడీ యాక్ట్
బ్రాండెడ్ విత్తనాల కవర్లలో నకిలీ పత్తి విత్తనాలు నింపి విక్రయిస్తున్న వ్యక్తిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నిందితుడిపై పీడీ యాక్ట్
కర్నూలు జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లు మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి.. నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్కు తరలిస్తున్నారు. ఈ నకిలీ విత్తనాలను అబ్దుల్లాపూర్మెట్లోని ఓ గోదాంలో నిల్వ చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా బ్రాండెడ్ విత్తనాల కవర్ల ద్వారా ఈ నకిలీ విత్తనాలను మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు.