తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుర్తుతెలియని వాహనం ఢీ... యువకుడు అక్కడికక్కడే మృతి

బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ యువకున్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

By

Published : Sep 9, 2020, 9:52 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీ... యువకుడు అక్కడిక్కడే మృతి
గుర్తుతెలియని వాహనం ఢీ... యువకుడు అక్కడిక్కడే మృతి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురం భీం ప్రాంగణపు మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంకు చెందిన ఇస్రో, బీజాబాయిల కుమారుడు ప్రకాశ్​(21)... ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్​లోని తన బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చాడు.

స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో పూలాజీ బాబా పాఠశాల సమీపాన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాశ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాశ్​... ట్రాక్టర్ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడిని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details