సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం రాలేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ అనే వ్యక్తి కొంతకాలంగా ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు.
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉపాధి దొరకపోవడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఈ ఘటన జరిగింది.
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ఎంత ప్రయత్నించినా కొలువు దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఇంటి పైభాగాన ఉన్న గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.