జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి మండలం మల్లపురం గ్రామంలో చిన్న కంబయ్య, సత్యమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కంబయ్య, సత్యమ్మ దంపతుల మధ్య కలహాలు నెలకొన్నాయి.
ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి - Tragedy in Mallapuram village
జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి, ముగ్గురు కూతుళ్లను చెరువులోకి తోసి తను ఆత్మహత్య చేసుకుంది.

ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
దీనితో మనస్తాపానికి గురైన సత్యమ్మ... చెరువులో ముగ్గురు పిల్లలు నందిని (10), శివాని (03), బుజ్జి (01) లను తోసి... అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.