తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2020, 9:30 AM IST

ETV Bharat / jagte-raho

భద్రాద్రిలో మరోసారి భారీగా గంజాయి పట్టివేత

భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా డీసీఎంలో తరలిస్తున్న పది సంచుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

marijuana heavily seized during vehicle inspection at bhadrachalam
వాహనాల తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసు వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎం వాహనాన్ని ఎస్ఐ మహేష్ తనిఖీ చేశారు. డీసీఎంలో తరలిస్తున్న పది గంజాయి సంచులను స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా విజయవాడకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. డీసీఎం వాహనంతోపాటు ఇద్దరిని రిమాండ్ చేసినట్లు సీఐ స్వామి తెలిపారు. 226 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు.. దాని విలువ సుమారు 33 లక్షల 97 వేలు ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి :తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details