సిమ్ స్వాప్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మొబైల్ నంబర్లను స్వాప్ చేసి.. మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులు వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీల ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్ చేసేస్తారు'
మొబైల్ నంబర్లను స్వాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. నైజీరియాలో ఉంటూ ఓ వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సిమ్లు, నకిలీ పత్రాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్ చేసేస్తారు'
మొబైల్ సిమ్లను బ్లాక్ చేసి నిందితులు నగదును కాజేస్తున్నారని... ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతోందని సీపీ తెలిపారు. నైజీరియాలో ఉంటున్న జేమ్స్ అనే వ్యక్తి వీరిని నడిపిస్తున్నట్లు గుర్తించామని... ఇప్పటివరకు 40 ఆధార్ కార్డులను సీజ్ చేశామని పేర్కొన్నారు. నిందితులు వినియోగించిన సిమ్లు, నకిలీ పత్రాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ తెలిపారు.
ఇదీ చూడండి:వైద్య విద్య సీట్ల కుంభకోణం- రూ.కోట్లు స్వాహా