తెలంగాణ

telangana

కుటుంబమంతటికీ కరోనా.. కుంగుబాటుతో యువకుడి ఆత్మహత్య

By

Published : Aug 13, 2020, 10:14 PM IST

హోంక్వారంటైన్​లో ఉన్న ఓ యువకుడు కుంగుబాటుకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్​హౌస్​పేటలో జరిగింది. మృతుడి కుటుంబమంతా.. కొవిడ్ ఆసుపత్రిలో ఉన్నారు.

suicide
suicide

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిల్​హౌస్​పేటకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకింది. వారిలో తల్లితండ్రులు, కుమార్తెను ఆశ్రం కొవిడ్ ఆసుపత్రిలో చేర్చారు. 24 ఏళ్ల కుమారుడికి కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో హోంక్వారంటైన్​లో ఉంచారు.

కొన్నాళ్లుగా ఒంటరిగా ఉండటంతో అతడు కుంగుబాటుకు గురై, బుధవారం ఇంట్లో ఫ్యాన్​ కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి :అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details