తెలంగాణ

telangana

సూసైడ్​​ నోట్​ రాసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

By

Published : Jan 21, 2021, 9:52 AM IST

హైదరాబాద్​ సనత్​నగర్​ రామారావునగర్​లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. యూసుఫ్​గూడ బెటాలియన్​లో విధులు నిర్వహిస్తున్న రాజేందర్​ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని సూసైట్​ నోట్​లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

constable-commits-suicide-at-sanath-nagar-in-hyderabad
సూసైడ్​​ నోట్​ రాసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్​ సనత్​నగర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని రామారావునగర్​లో కానిస్టేబుల్ రాజేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్​కర్నూల్​ జిల్లాకు చెందిన రాజేందర్ యూసుఫ్​గూడలోని ఫస్ట్ బెటాలియన్​లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు దీపావళి ముందు రోజు సస్పెండ్ అయ్యారు.

ఆస్తి తగాదాలతో విసిగిపోయిన రాజేంద్ర తన చావుకు అత్త, మామ, భార్యే కారణంగా పేర్కొంటూ సూసైట్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన మరణానంతరం ఆస్తి తన పిల్లలకే చెందాలని రాసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details