హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారావునగర్లో కానిస్టేబుల్ రాజేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన రాజేందర్ యూసుఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు దీపావళి ముందు రోజు సస్పెండ్ అయ్యారు.
సూసైడ్ నోట్ రాసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ సనత్నగర్ రామారావునగర్లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. యూసుఫ్గూడ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని సూసైట్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
సూసైడ్ నోట్ రాసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
ఆస్తి తగాదాలతో విసిగిపోయిన రాజేంద్ర తన చావుకు అత్త, మామ, భార్యే కారణంగా పేర్కొంటూ సూసైట్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన మరణానంతరం ఆస్తి తన పిల్లలకే చెందాలని రాసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.