తెలంగాణ

telangana

తల్లిదండ్రుల గొడవతో విసిగిన యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామంలో చోటు చేసుకుంది.

By

Published : May 8, 2020, 12:04 AM IST

Published : May 8, 2020, 12:04 AM IST

తల్లిదండ్రుల గొడవతో విసిగిన యువకుడు ఆత్మహత్య
తల్లిదండ్రుల గొడవతో విసిగిన యువకుడు ఆత్మహత్య

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రాల గ్రామానికి చెందిన కడారి రాంబాబు, సోమలక్ష్మి దంపతుల కుమారుడు కడారి మణికంఠ వర్ధన్నపేట భారతి డిగ్రీ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. తల్లిదండ్రులు మనస్పర్ధల కారణంగా ఏడు ఏళ్లుగా వేరుగా ఉండటం వల్ల మణికంఠ తల్లితో కలిసి అమ్మమ్మ ఊరైన నరసింహులగూడెంలో నివాసముంటున్నాడు.

చీరతో ఉరి...

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో మణికంఠ, సూర్యాపేట జిల్లా పరిధి నర్సింహులగూడెం వచ్చాడు. కుటుంబ సమస్యలు మానసిక ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో దండంపై ఆరవేసిన చీరతో ఇంటికి సమీపంలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న నాగారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించినట్లు నాగారం ఎస్సై లింగం తెలిపారు.

ఇవీ చూడండి : భార్యతో గొడవ పడి సెల్​ టవర్​ ఎక్కిన భర్త

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details