తెలంగాణ

telangana

నీటి తొట్టెలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి

నీటి తొట్టెలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. తల్లి వంట పనుల్లో నిమగ్నమవగా ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి నీటి తోట్టిలో పడి మరణించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

By

Published : Nov 30, 2020, 11:33 PM IST

Published : Nov 30, 2020, 11:33 PM IST

నీటి తొట్టెలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి
నీటి తొట్టెలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి

చిత్తూరు జిల్లా తిరుమల బాలాజీ నగర్​కు చెందిన శశికళ ఆరేళ్ల చిన్నారి నీటి తొట్టెలో పడి మరణించింది. రామచంద్రాపురం మండలం, నెత్తకుప్పానికి చెందిన భానుప్రకాష్, జయంతి దంపతులు తిరుమలలో వ్యాపారం చేసుకొని జీవిస్తుంటారు. భానుప్రకాష్ వ్యాపార నిమిత్తం దుకాణానికి వెళ్లారు. తల్లి వంట చేస్తోంది. ఇదే సమయంలో ఆడుకుంటున్న వారి కుమార్తె శశికళ నీటి తొట్టిలో పడింది. కొంత సమయానికి గమనించిన తల్లి జయంతి... పాపను వెంటనే అశ్వని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details