పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది.
బుధవార్ పేట్కు చెంది సయ్యద్ ఫాయీమ్ పురపాలక శాఖ అధికారులు అన్యాయంగా ఇల్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రజలు అడ్డుకుని ఫాయిమ్ని ఆస్పత్రికి తరలించారు.