తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2021, 12:35 PM IST

ETV Bharat / jagte-raho

ఇల్లు కూలుస్తామని నోటీసులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అన్యాయంగా తన ఇల్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు.

A man committed suicide by pouring petrol. The incident took place in front of the Nirmal District Municipal Office
నిర్మల్​లో.. పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది.

బుధవార్ పేట్​కు చెంది సయ్యద్ ఫాయీమ్ పురపాలక శాఖ అధికారులు అన్యాయంగా ఇల్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రజలు అడ్డుకుని ఫాయిమ్​ని ఆస్పత్రికి తరలించారు.

అన్యాయం..

70 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని .. అధికారులు తమ ఇంటిని కూల్చివేస్తామని నోటీసులు జారీ చేయటం అన్యాయమని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇంట్లో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని.. కూల్చేస్తే ఎక్కడికి వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నేడు 16,200 మందికి టీకాలు.. ఒక్కో కేంద్రంలో 50 మందికి

ABOUT THE AUTHOR

...view details