తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సూసైడ్ అంటూ భార్యకు సెల్ఫీ.. ఆ తర్వాత...

భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మెడకు తాడు బిగించుకుని ఫొటో తీసి భార్యకు పంపించాడు. చివరికి పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేమైందంటే..

By

Published : May 9, 2020, 11:45 AM IST

Updated : May 9, 2020, 11:55 AM IST

a-husband-sent-pre-suicide-selfie-photo-to-his-wife-in-badradri-kothagudem-district
సూసైడ్ అంటూ భార్యకు సెల్ఫీ.. ఆ తర్వాత...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సంజయ్​నగర్​కు చెందిన కేశినేని లక్ష్మణ్​ తన భార్య లావణ్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన లక్ష్మణ్..​ ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. మెడకు తాడు బిగించుకుని భార్యకు సెల్ఫీ ఫొటో పంపించాడు. కంగారు పడిన భార్య లావణ్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

సెల్​ఫోన్ లొకేషన్ ఆధారంగా లక్ష్మణ్​ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ వేణుచందర్ తెలిపారు.

ఇదీచూడండి: కుషాయిగూడలో రోడ్డెక్కిన వలస కూలీలు..

Last Updated : May 9, 2020, 11:55 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details