తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ యువరాజుతో డోభాల్‌ భేటీ-కశ్మీర్​పై చర్చ!

సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో సమావేశమయ్యారు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్​ డోభాల్​. కశ్మీర్​ అంశంపై చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక బంధాలపైనా చర్చించినట్లు వెల్లడించారు.

By

Published : Oct 3, 2019, 6:22 AM IST

సౌదీ యువరాజుతో డోభాల్‌ భేటీ-కశ్మీర్​పై చర్చ!

సౌదీ యువరాజుతో డోభాల్‌ భేటీ-కశ్మీర్​పై చర్చ!

జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌.. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో సమావేశమయ్యారు. సౌదీ పర్యటనలో భాగంగా యువరాజుతో భేటీ అయి కశ్మీర్​ అంశంపై చర్చించారు డోభాల్.

ఇరువురి మధ్య సమావేశం సుమారు 2గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌ అంశంలో భారత్‌ అనుసరిస్తున్న తీరును యువరాజు సమర్థించినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. దీనివల్ల కశ్మీర్‌ అంశంలో సౌదీ తమకు మద్దతుదారుగా ఉండాలని కోరుకుంటున్న పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల మధ్య బంధాల బలోపేతం ఉద్దేశంతో డోభాల్‌ సౌదీ పర్యటనకు వెళ్లారు. యువరాజుతో ద్వైపాక్షిక బంధాలపైనా చర్చించారు డోభాల్​. సౌదీ భద్రతా సలహాదారుతోనూ సమావేశం నిర్వహించారు.

అనంతరం యూఏఈ నాయకత్వంతోనూ భేటీ అయి కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ పన్నుతున్న కుట్రలను వారి దృష్టికి తెచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధికరణ 370 రద్దు వల్ల కశ్మీర్‌తో కలిపి ఏకీకృత భారత్‌ అవతరించిందనే సందేశాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సౌదీ యువరాజును కలిశారు. కశ్మీర్‌ అంశంలో తమకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. కానీ చైనా, మలేసియా, టర్కీ మినహా అంతర్జాతీయ సమాజం మొత్తం కశ్మీర్‌ విషయంలో భారత్‌కు మద్దతిస్తున్నాయి.

ఇదీ చూడండి: గాంధీ 150: ఈటీవీ భారత్​ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details