తెలంగాణ

telangana

'యుద్ధం తర్వాత ప్రజల సేఫ్టీ ముఖ్యం- ఇజ్రాయెల్​ సరిహద్దుల్లో గట్టి భద్రత!'

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 7:28 PM IST

Israel Security At Border : హమాస్​తో యుద్ధం ముగిసిన తర్వాత భవిష్యత్తులో తమ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలని ఇజ్రాయెల్‌ కోరుకుంటోంది. ఇందుకోసం సరిహద్దు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై తమ ప్రతిపాదనను అరబ్‌ దేశాలకు ఇజ్రాయెల్‌ తెలియజేసింది.

Israel Security At Border
Israel Security At Border

Israel Security At Border : కాల్పుల విరమణ ఒప్పందం ముగియడం వల్ల ఇజ్రాయెల్​ మరోసారి గాజాపై విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఇజ్రాయెల్‌ ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం గాజా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఈ ఏర్పాట్లపై తమ ప్రతిపాదనను అరబ్‌ దేశాలకు తెలియజేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సీనియర్‌ సలహాదారుడు మార్క్ రెగెవ్ వెల్లడించారు.

'యుద్ధం ముగియగానే గాజా సరిహద్దుల నుంచి..'
Israel Security Arrangements : "సరిహద్దులను దాటుకుని హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి ప్రజలను చంపారు. యుద్ధం ముగిసిన తర్వాత భవిష్యత్తులో ఉగ్రవాదుల నుంచి మా ప్రజలకు ఎలాంటి ముప్పు కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకోసం యుద్ధం ముగియగానే గాజా సరిహద్దుల నుంచి హమాస్‌ను తొలగించి దాడులను నిరోధించేలా ఆ ప్రాంతంలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలి. గాజా సరిహద్దులో పాలస్తీనా వైపుగా కట్టుదిట్టమైన భద్రతా బఫర్‌ జోన్లను ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్‌ కోరుకుంటోంది. ఈ విషయంలో అరబ్‌ దేశాలతో భాగస్వామ్యం పంచుకుంటాం" అని మార్క్‌ రెగెవ్‌ తెలిపారు.

ఇజ్రాయెల్‌ దాడిలో మా సైనికుల మృతి: ఇరాన్‌
Israel Attack On Gaza Latest News : అయితే సిరియాపై ఇజ్రాయెల్‌ శనివారం జరిపిన వైమానిక దాడిలో తమ దేశానికి చెందిన ఇద్దరు పారామిలిటరీ రివల్యూషనరీ గార్డులు మృతి చెందారని ఇరాన్‌ వెల్లడించింది. వారు సిరియాకు సలహా మిషన్‌పై వెళ్తున్నారని తెలిపింది. మరోవైపు శనివారం ఉదయం సిరియా రాజధాని డమాస్కస్‌ శివార్లలో పలు వైమానిక దాడులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. హెజ్‌బొల్లాతో కలిసి పనిచేసే మిలిటరీ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపింది. ఈ దాడుల్లో ఇద్దరు సిరియా పౌరులు మృతి చెందారని పేర్కొంది.

'బందీల్లో ఎంతమంది బతికున్నారో తెలీదు'
Israel Hamas Latest News : బందీల గురించి ఓ హమాస్‌ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎంతమంది బందీలు సజీవంగా ఉన్నారంటూ హమాస్‌ నేత ఘాజీ హమద్‌ను ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ ప్రశ్నించింది. 'దాని గురించి నాకేం తెలీదు. ఆ సంఖ్య నాకు ముఖ్యం కాదు' అని ఆయన ఇచ్చిన సమాధానం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, అతడి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా స్పందించింది. 'ఎంతమంది బందీలు సజీవంగా ఉన్నారో తనకు తెలియదని హమాస్‌ చెబుతోంది. ఇజ్రాయెల్‌ ప్రజలు ప్రాణాలకు విలువ ఇస్తారు. హమాస్‌ మరణాన్ని కోరుకుంటోంది' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ మరో రోజు పొడిగింపు- ఫలించిన ఖతార్​, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం

గాజాపై మళ్లీ బాంబుల వర్షం-15 వేలు దాటిన మరణాలు- హమాస్ అంతానికి నెతన్యాహు కొత్త స్కెచ్!

ABOUT THE AUTHOR

...view details