తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా మరణాన్ని తప్పించే ఔషధం ఇదే!

ఇప్పటివరకు వ్యాక్సిన్​ లేని కరోనా వైరస్​ నుంచి ప్రజలను డెక్సమెథసోన్‌ అనే ఓ ఔషధం కాపాడుతోంది. దీన్ని వాడటం వల్ల మృత్యువు అంచుకు వెళ్లిన బాధితులను కూడా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి బ్రిటన్​లో మొత్తం 5 వేల మందిని రక్షించారు. అతితక్కువ ధరకే ఈ మందు అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత.

By

Published : Jun 16, 2020, 8:10 PM IST

Steroid dexamethasone reduces deaths among patients with severe COVID-19 trial shows
కరోనా మరణాన్ని తప్పిస్తున్న ఔషధం అదే!

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80లక్షల మందిపైగా కరోనా బారిన పడగా, 4లక్షలకు పైగా మంది మరణించారు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యులు, పరిశోధకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ను కనుగోనేందుకు వివిధ దేశాలు ఎప్పుడో పరిశోధనలు మొదలు పెట్టాయి. అయితే కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న వారి ప్రాణాలను కాపాడుతోంది ఓ ఔషధం. అదే డెక్సమెథసోన్‌.

అతి తక్కువ స్థాయిలో డెక్సమెథసోన్‌ స్టెరాయిడ్‌ను వాడటం వల్ల మృత్యువుకు దగ్గరైన కరోనా బాధితులు తిరిగి కోలుకున్నట్లు గుర్తించినట్టు బ్రిటన్​కు చెందిన పరిశోధకులు తెలిపారు. కరోనా తీవ్రరూపం దాల్చి వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న బాధితులకు డెక్సమెథసోన్‌ ఇవ్వగా.. బాగా పనిచేసిందని, వారు తిరిగి కోలుకున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించామన్నారు. అలా యూకేలో ఇప్పటివరకు 5వేలమందిని కాపాడారు. పైగా ఈ ఔషధం అతి తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం.

"కొవిడ్‌-19తో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నవారికి డెక్సమెథసోన్‌ ఆక్సిజన్‌లా పనిచేస్తోంది. అది వారి జీవితాలను కాపాడుతోంది. పైగా అతి తక్కువ ధరకే లభించడం విశేషం"

-ప్రొఫెసర్‌ మార్టిన్‌ లాండ్రే, ఆక్స్​ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

'ఈ జనరిక్‌ స్టెరాయిడ్‌ డ్రగ్‌ వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించాం. ఇది చక్కగా పనిచేస్తోంద'ని మరో పరిశోధకుడు పీటర్‌ హార్బీ తెలిపారు.

ఎలాంటి వారిపై దీన్ని వినియోగిస్తున్నారు

కరోనా బారిన పడ్డ ప్రతి 20మందిలో 19మంది ఆస్పత్రికి వెళ్లకుండానే కోలుకుంటున్నారు. ఆ ఒక్క వ్యక్తికి తప్పనిసరిగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోంది. వీరిని హైరిస్క్‌ పెషెంట్‌గా పరిగణించాలి. ఇలాంటి వారికి మాత్రమే డెక్సమెథసోన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని వినియోగించిన తర్వాత కరోనా రోగిలో వ్యాధినిరోధకశక్తి మెరుగవడాన్ని గుర్తించారు.

దీనిపై వైద్యుల బృందం పరిశోధనలు జరిపింది. 2వేలమంది రోగులకు డెక్సమెథసోన్‌ ఇచ్చి, 4వేల మందికి ఈ ఔషధాన్ని ఇవ్వకుండా పరీక్షలు చేసింది. డెక్సమెథసోన్‌ తీసుకున్న వారి ఆరోగ్యం మెరుగుపడటాన్ని వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా వెంటిలేటర్‌ చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడుతున్న వారిపై సానుకూల ప్రభావం చూపుతోంది. మరణాలు 40శాతం నుంచి 28శాతానికి తగ్గగా, ఆక్సిజన్‌ అవసరమైన వారు 25శాతం నుంచి 20శాతానికి తగ్గారు.

అతి తక్కువ, మధ్య స్థాయి కరోనా లక్షణాలు ఉన్నవారికి డెక్సమెథసోన్‌ అంతగా ఉపయోగపడదని ప్రొఫెసర్‌ లాండ్రే తెలిపారు. కొవిడ్‌-19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ప్రకటించిన నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:పరిస్థితిని మరింత దిగజారనీయొద్దు: చైనా హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details