తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 6:14 AM IST

ETV Bharat / international

లండన్​లో లాక్​డౌన్​ బదులు మూడంచెల విధానం

బ్రిటన్​లో మరోసారి మూడంచెల కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రస్తుత లాక్​డౌన్ డిసెంబర్ 2న ముగిసిన తర్వాత మూడంచెల విధానం అమలులోకి వస్తుందని వెల్లడించారు.

Johnson confirms Dec 2 end to lockdown
డిసెంబర్ 2తో బ్రిటన్​లో లాక్​డౌన్ ముగింపు

బ్రిటన్​లో ఇంటికే పరిమితం కావాలన్న లాక్​డౌన్ నిబంధనలు డిసెంబర్ 2తో ముగుస్తాయని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కొవిడ్ వింటర్ ప్లాన్​ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగతుందని స్పష్టం చేశారు. లాక్​డౌన్ బదులు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఆధారంగా మూడంచెల విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

తక్కువ రిస్క్​ ఉన్న ప్రాంతాలను టైర్​-1, మధ్యస్థ రిస్క్ ఉన్న ప్రాంతాలను టైర్​-2, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను టైర్​-3గా విభజించనున్నట్లు తెలిపారు.

మూడంచెల విధానం ఇలా..

టైర్​ 1,2లలో నిబంధనలకు లోబడి ఇతర వ్యక్తులను కలిసేందుకు అనుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పబ్​లు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల తర్వాత మూసేయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో క్రీడా కార్యక్రమాలకు అనుమతులు ఉంటాయి.

టైర్​ 3 ప్రాంతాల్లో మాత్రం బయట ఇతర వ్యక్తులను కలిసేందుకు అనుమతులు ఉండవు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు. టేక్​ అవేలు తప్పా రెస్టారెట్లు, పబ్​లు తెరిచేందుకు అనుమతులు ఉండవు.

ప్రతి 14 రోజులకు ఓ సారి ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను సమీక్షించి.. వాటి స్థితిని మార్చనున్నారు.

ఇదీ చూడండి:ఆశాకిరణంగా ఆక్స్​ఫర్డ్ టీకా- 70 శాతం సమర్థత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details