తెలంగాణ

telangana

ETV Bharat / international

పీఓకే అధ్యక్షుడికి భారీ షాక్ ఇచ్చిన భారత్​

ఫ్రాన్స్​ పార్లమెంట్​లో పాక్​ అక్రమిత కశ్మీర్​ అధ్యక్షుడు మసూద్​ ఖాన్​కు చుక్కెదురైంది. ఆయన ఫ్రాన్స్ లోక్​సభను ఉద్దేశించి ప్రసంగించకుండా భారత్ అడ్డుకుంది.

By

Published : Oct 3, 2019, 3:51 PM IST

పివోకే అధ్యక్షుడిని అడ్డుకున్నభారత్​

ఫ్రాన్స్​ పార్లమెంట్​లో పాక్​ అక్రమిత కశ్మీర్​ అధ్యక్షుడు మసూద్​ ఖాన్​ ప్రసంగించకుండా​ అడ్డుకుంది భారత్. మసూద్​ను ఫ్రాన్స్​ లోక్​సభలో మాట్లాడించేందుకు పాక్​ దౌత్య బృందం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్​ దౌత్య బృందం ఫ్రాన్స్​ విదేశాంగ శాఖకు హెచ్చరిక చేసింది. కశ్మీర్ భారత్​లో అంతర్భాగమైనందున పీఓకే అధ్యక్షుడి ప్రసంగానికి అనుమతి ఇవ్వడం భారత సార్వభౌమాధాకారాన్ని ప్రశ్నించడమే అవుతుందని పేర్కొంది. మసూద్​కు వ్యతిరేకంగా సంతకాల చేసి ప్రవాస భారతీయులు తమ నిరసన వ్యక్తం చేశారు.

ఐరాస భద్రతా మండలిలో జైషే మహ్మద్ అధినేత మసూద్​ ఆజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటానికి ఫ్రాన్స్​ కృషి చేసింది. తాజా ఘటనతో పాక్‌కు మరో భంగపాటు ఎదురైనట్లు అయింది.
కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్​ కశ్మీర్​ సమస్యను అంతర్జాతీయ వేదికపై తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ అంతర్జాతీయ సమాజం పాక్​ వాదనను పట్టించుకోవడం లేదు.

ఇదీ చూడండి : కశ్మీర్​ సహా పలు అంశాలపై పాంపియో-జైశంకర్​ చర్చ

ABOUT THE AUTHOR

...view details