తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​లో కరోనా టాప్​గేర్​-పాక్​లో తెరుచుకున్న స్కూళ్లు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 18 లక్షల 87 వేలు దాటింది. ఇప్పటివరకు 9 లక్షల 77 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్​లో 6 నెలల సుదీర్ఘ విరామం బుధవారం స్కూళ్లు తెరిచారు. రష్యాలో రోజూ 6 వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్​ మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది.

By

Published : Sep 23, 2020, 9:58 PM IST

Global COVID-19 tracker
బ్రిటన్​లో కరోనా టాప్​గేర్​-పాక్​లో తెరుచుకున్న స్కూళ్లు

కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రష్యాలో ఇవాళ 6 వేల 431 కేసులు నమోదయ్యాయి. మరో 150 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 19,799కు చేరింది.

  • బ్రిటన్​లో మళ్లీ వైరస్​ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 6,178 కొత్త కేసుల్ని గుర్తించారు. ఇరాక్​, ఇజ్రాయెల్​లోనూ మరో 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
  • మెక్సికోలో 4,683 కొత్త కేసులు వెలుగుచూశాయి ఒక్కరోజే 651 మంది మరణించారు.
  • నేపాల్​లో బుధవారం 1172 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 67 వేల 804 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే 1893 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. దేశంలో రికవరీ రేటు 73.7 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 7 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 436కు చేరింది.
  • సింగపూర్​లో ఇప్పటివరకు 57 వేల 639 మందికి కరోనా సోకింది. 27 మంది మరణించారు. 12 కొత్త కేసులను గుర్తించారు.

పాక్​లో తెరుచుకున్న స్కూళ్లు..

పొరుగుదేశం పాకిస్థాన్​లో దాదాపు 6 నెలల విరామం తర్వాత.. పాఠశాలలు తెరుచుకున్నాయి. 6-8 తరగతుల విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తున్నారు. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది ప్రభుత్వం.

దేశంలో ఇప్పటివరకు 3 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. బుధవారం 532 కొత్త కేసులు బయటపడ్డాయి.

విదేశీయులకు చైనా అనుమతి..

చైనాలో నివసించే విదేశీయులను దేశంలోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్​ 28 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కరోనా నేపథ్యంలో.. ఈ ఏడాది ప్రారంభంలో విదేశీ వీసాలపై ఆంక్షలు విధించింది చైనా. మార్చి 28 నుంచి విదేశీయులను దేశంలోకి అనుమతించలేదు.

ABOUT THE AUTHOR

...view details