తెలంగాణ

telangana

By

Published : May 8, 2021, 4:36 PM IST

Updated : May 8, 2021, 5:05 PM IST

ETV Bharat / international

ఫైజర్​తో ఈయూ అతిపెద్ద వ్యాక్సిన్ ఒప్పందం

2023 నాటికి పెద్దఎత్తున కరోనా టీకాలను సమకూర్చుకోవాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్​ సంస్థ నుంచి 1.8 బిలియన్ డోసుల టీకాలు కొనుగోలు చేసే భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

EU agrees potential 1.8 billion-dose purchase of Pfizer jab
ఫైజర్​ టీకా ఈయూ

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు పెద్దఎత్తున టీకాలు కొనుగోలు చేయాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. 2023 నాటికి 1.8 బిలియన్ టీకా డోసులను సరఫరా చేసేలా ఫైజర్​-బయోఎన్​టెక్​తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

నూతన ఒప్పందం ప్రకారం.. సభ్య దేశాలకు అందించే వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన వనరులను ఫైజర్​ సంస్థకు ఐరోపా సమాఖ్య సమకూర్చనుంది.

ఈ మేరకు.. 900 మిలియన్ డోసుల టీకాలు కచ్చితంగా సరఫరా చేసేలా ఫైజర్​తో ఒప్పందం ఖరారైనట్లు ఈయూ అధ్యక్షుడు ఉర్సులా ఓన్​ లియెన్ ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు.

ఇప్పటికే కనీసం అర డజను కంపెనీల నుంచి 2.3 బిలియన్ డోసులను పొందేలా ఐరోపా కమిషన్ ప్రణాళికలు వేసింది. ఈ క్రమంలో ఇతర ఒప్పందాలు, టీకా సాంకేతికతలనూ పరిశీలించనున్నట్లు ఈయూ అధ్యక్షుడు ట్విట్టర్​లో తెలిపారు.

ఇవీ చదవండి:'భారత్​-ఈయూ చర్చలతో వాణిజ్యం బలోపేతం'

వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఐరోపా దేశాలు సిద్ధం!

Last Updated : May 8, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details