తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2020, 5:56 AM IST

ETV Bharat / international

ఐరోపాలో 45 వేలు దాటిన కరోనా మృతులు

ఐరోపా దేశాలను కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకు సుమారు 45 వేల మందికిపైగా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఇటలీలో 15,362 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.

Coronavirus death toll tops 45,000 in Europe
ఐరోపాలో 45 వేలు దాటిన కరోనా మృతులు

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బెంబేలెత్తిస్తున్న కరోనా..ఐరోపాలో​లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. శనివారం సాయంత్రానికి ఐరోపాలో కరోనా మృతుల సంఖ్య 45 వేలు దాటింది. వారిలో 85 శాతం ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​, బ్రిటన్​ దేశాలకు చెందినవారు ఉన్నారు.

మొత్తం ఐరోపా​ ఖండంలో 46,033 మరణాలు, 6,27,203 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 15,362 మంది మృతి చెందగా.. స్పెయిన్​లో 11,744, ఫ్రాన్స్​లో 7,560, బ్రిటన్​లో 4,313 మంది బలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details