తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2019, 8:28 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​పై 3వ ప్రతిపాదనకూ ఎంపీల తిరస్కారం

బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని మూడోసారి తిరస్కరించారు బ్రిటన్​ పార్లమెంటు సభ్యులు. దీంతో పాటు నాలుగు బ్రెగ్జిట్​ ప్రత్యామ్నాయల ప్రణాళికలు కూడా వీగిపోయాయి.

థెరిసా మే బ్రెగ్జిట్​ మూడోసారి తిరస్కరణ

థెరిసా మే బ్రెగ్జిట్​ మూడోసారి తిరస్కరణ

బ్రిటన్​ ప్రధానమంత్రి థెరిసామే ప్రతిపాదిస్తున్న బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని పార్లమెంటు మూడోసారి తిరస్కరించింది. నాలుగు ప్రత్యామ్నాయ ప్రణాళికలకు కూడా ఆమోదం లభించలేదు.

ఐరోపా సమాఖ్యను వీడిన అనంతరం కూడా ఆర్థిక సంబంధాలు కొనసాగించటం, రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, ఒప్పందం లేకుండా ఈయూ నుంచి తప్పుకోవటాన్ని ఆపేందుకు బ్రెగ్జిట్​ను నిలిపివేయటం లాంటివి ఈ ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.

రెండో ప్రజాభిప్రాయ సేకరణకు 280 మంది అంగీకరించగా 292 మంది తిరస్కరించారు. కస్టమ్స్​ సమాఖ్యలో కొనసాగాలన్న దానికి 273 మంది సమ్మతం తెలపగా... 276 మంది అంగీకరించలేదు.

నాలుగో సారి థెరిసా మే ఒప్పందం...

ఈ పరిణామాల అనంతరం.. తమ ఒప్పందమే సరైనదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారంలో మరోసారి పార్లమెంటు ముందుంచుతామని తెలిపింది.

ఏప్రిల్​ 11 వరకు బ్రిటన్ దేనికి అంగీకరించకపోయినట్లయితే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి వైదొలగాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​పై అదే ప్రతిష్టంభన- రాజీనామాకు మే సిద్ధం

ABOUT THE AUTHOR

...view details