తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 7:09 AM IST

Updated : Mar 26, 2019, 7:32 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ చిక్కులతో థెరిసా మే ఉక్కిరిబిక్కిరి

బ్రెగ్జిట్​ బిల్లుపై బ్రిటన్​ చట్ట సభ్యులు పట్టు బిగించారు. ఎంపీల అనుమతి లేకుండా బిల్లుపై ఎటువంటి నిర్ణయాలు, చర్చలు చేపట్టకూడదనే అంశంపై జరిగిన ఓటింగ్​లో విజయం సాధించారు.

థెరిసా మే

బ్రెగ్జిట్​ చిక్కులతో థెరిసా మే ఉక్కిరిబిక్కిరి

బ్రెగ్జిట్​ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎంపీల అనుమతి లేకుండా బ్రెగ్జిట్​ బిల్లుపై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండేలా బ్రిటన్​ పార్లమెంటు​లో ఓటింగ్​ జరిగింది. మొత్తం 329 మంది ఎంపీలు ఓటింగ్​లో పాల్గొనగా 302 మంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు.

వీలైనంత త్వరగా ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయేందుకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే పావులు కదుపుతున్నారు. ఇందుకు సొంత పార్టీ ఎంపీలే అడ్డుతగులుతున్నారు. తాజాగా మరోసారి బ్రెగ్జిట్​ విషయంలో ప్రధానికి భంగపాటు తప్పలేదు.

బ్రెగ్జిట్​పై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బ్రిటన్​లో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

కొనసాగుతున్న రాజీనామాలు:

బ్రిటన్​లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు మంత్రులు బ్రెగ్జిట్​పై థెరిస్సా మే వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేశారు. బిల్లుపై ఎంపీల నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ వీరు ఓటు వేశారు.

విదేశాంగ మంత్రి అలిస్టయిర్​ బర్ట్​, వైద్య మంత్రి స్టీవ్​ బ్రైన్​, వాణిజ్య మంత్రి రిచర్డ్​ రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

ప్రభుత్వం దేశ ప్రజలతో ఆడుకుంటోందని వైద్య మంత్రి స్టీవ్​ బ్రైన్​ రాజీనామా లేఖలో ఆరోపించారు.

Last Updated : Mar 26, 2019, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details