తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లు పాసయ్యేనా?

బ్రెగ్జిట్​ ఒప్పందంపై బ్రిటన్​ పార్లమెంటు​లో మంగళవారం చర్చ జరగనుంది. చట్ట సభ్యుల డిమాండ్​ మేరకు ఒప్పందంలో సవరణలు చేస్తామని బ్రిటన్​ ప్రధాని థెరిసా మే ప్రకటించారు. ఒప్పందం ఆమోదానికి అందరూ కలిసి రావాలని కోరారు.

By

Published : Mar 12, 2019, 12:33 PM IST

Updated : Mar 12, 2019, 5:03 PM IST

థెరిసా మే

బిల్లు ఆమోదం పొందేనా

ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగే బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బ్రిటన్ ప్రతిపక్షాలు. వారిని శాంతింపచేసేందుకు చర్యలు చేపట్టారు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే. నేడు బ్రిటన్​ పార్లమెంటులో ఒప్పందంపై చర్చ జరగనున్న నేపథ్యంలో సభ్యులనుద్దేశించి ప్రకటన విడుదల చేశారు థెరిసా మే.

చట్టసభ్యులు లేవనెత్తిన లోపాల సవరణకు ఐరోపా సమాఖ్యతో చర్చలు జరిపినట్లు ప్రధాని థెరిసా మే ప్రకటించారు. ఒప్పందంలో మార్పులు చేయటానికి ఐరోపా సమాఖ్య​ నుంచి చట్టబద్ధమైన హామీ పొందినట్లు స్పష్టం చేశారు.

ఐరోపా సమాఖ్య నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి బ్రిటన్​కు మార్చి 29 తుది గడువు.

చట్టానికి లోబడి మార్పులు చేసిన బ్రెగ్జిట్​ ఒప్పందం సభ్యుల ముందుకు రానుంది. ఆ చర్చలో నేను మరిన్ని విషయాలు వివరిస్తాను. చట్టబద్ధ మార్పులు కావాలని ఎంపీలు కోరారు. దానికి అనుగుణంగానే సవరణలు చేశాం. అందరూ ఒకే తాటిపైకి వచ్చి బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని ఆమోదించి, బ్రిటన్​ ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సిన సమయమిది.-థెరిసా మే,బ్రిటన్​ ప్రధాని

ఒప్పందంలోని​ కొన్ని అంశాలపై చట్ట సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినా ఐర్లాండ్​తో సరిహద్దులు ఎప్పటిలానే తెరిచి ఉండాలని చట్ట సభ్యులు పట్టుబడుతున్నారు.

మే ప్రకటనపై బ్రెగ్జిట్​ను వ్యతిరేకిస్తున్న చట్ట సభ్యులు స్పందించారు. ఒప్పందంలో తాము డిమాండ్​ చేసిన సవరణలు అన్ని ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఒప్పందంలో ఎలాంటి మార్పులు ఉండవని బ్రెగ్జిట్​ బిల్లుకు మరోసారి తిరస్కరణ తప్పదని కొంతమంది చట్టసభ్యులు ట్వీట్​ చేశారు.

Last Updated : Mar 12, 2019, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details