కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం.. పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్లోని అతిపెద్ద మాంసాహార మార్కెట్ను ఆదివారం సందర్శించింది. డబ్ల్యూహెచ్ఓ బృందంతో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు మార్కెట్ సందర్శనకు హాజరయ్యారు.
తొలిదశలో కరోనా కేసులు నమోదైన వుహాన్లోనిజిన్యాన్టాన్ ఆసుపత్రిని, హుబెయ్లోని చైనీస్, వెస్టర్న్ మెడిసిన్ ఆసుపత్రిని ఇప్పటికేఈ బృందం సందర్శించింది. ఓ మ్యూజియంలోనూ శనివారం పర్యటించింది. ఇటీవలే 14రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఈ బృందం.. క్షేత్రస్థాయి పరిశోధనను చేపట్టింది.