పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్నకు స్వదేశంలోనే చేదు అనుభవం ఎదురైంది. షరీఫ్కు హృద్రోగ ప్రత్యేక అంబులెన్సు సేవలను అందించేందుకురెండు ప్రభుత్వ ఆసుపత్రులు నిరాకరించాయి. గత కొంతకాలంగా లాహోర్ జైలులో అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు షరీఫ్.
అత్యవసర సమయంలో మాజీ ప్రధానిని ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా కారాగారం వద్ద ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని పాక్ పంజాబ్ రాష్ట్ర జైళ్ల విభాగం వారు ఆరోగ్య శాఖ అధికాలను కోరారు. జైళ్ల శాఖ వారి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన అంబులెన్స్లో సరైన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించారని డాన్ పత్రిక పేర్కొంది.
గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేయాలని అధికారులు కోరగా... ఈ అభ్యర్థనను ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది.
"వీఐపీలు, వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులు, రాష్ట్ర అసెంబ్లీ నేతలు, న్యాయమూర్తులు, ఆయా ప్రముఖుల కుటుంబాల సేవలో అంబులెన్సులు ఉన్నందున వైద్య బృందాలపై అధిక భారం పడుతోంది."