తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆటో 2.0': ఈగ, ఊసరవెల్లి, పక్షి రాజు

వాహనాలకు తరచూ మరమ్మతులు చేస్తాం. కొత్తవి కొనుగోలు చేసి పాతవి పడేస్తాం. ఎందుకు పనికిరావు అని అనుకుంటాం. కానీ ఆ వ్యర్థాలతోనే రష్యాకు చెందిన షెవ్​చెంకో అద్భుతమైన శిల్పాలను రూపొందిస్తున్నాడు.

By

Published : Jun 23, 2019, 1:24 PM IST

'ఆటో 2.0': ఈగ, ఊసరవెల్లి, పక్షి రాజు

'ఆటో 2.0': ఈగ, ఊసరవెల్లి, పక్షి రాజు

ఇప్పుడు ప్రపంచమంతా టెక్​ మయమే! అత్యాధునిక సాంకేతికతతో రోజుకో సరికొత్త వాహనం మార్కెట్లో సందడి చేస్తోంది. అందుకు తగ్గట్టే వ్యర్థాల సంఖ్యా పెరిగిపోతోంది. మిగిలిపోయిన, పనికిరాని వాహన భాగాలను మనం పడేస్తాం. ఇలాంటి ఆటోమొబైల్​ వ్యర్థాలతోనే రష్యాకు చెందిన షెవ్​చెంకో కళ్లుచెదిరే శిల్పాలను తయారుచేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకుండానే వ్యర్థాల నుంచి అందమైన ఆకృతులు రూపొందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

మాస్కోలో 'ఇంక్రెడిబుల్ వరల్డ్​ ఆఫ్​ జులెస్​ వెర్నె​' పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో షెవ్​చెంకో రూపొందించిన వస్తువులు వీక్షకులను ఆకట్టుకుంచున్నాయి.

"దాదాపు నాలుగేళ్ల క్రితం నేను కొన్ని పనికిరాని కారు భాగాలను చూశాను. వాటితో ఏదైనా అందమైన వస్తువు రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. ఇదంతా అప్పుడు మొదలైంది. నా మొదటి ప్రయత్నం చాలా చిన్నది. అప్పటి నుంచి నేను ఈ పని చేస్తున్నా."
--- ఇగోర్​ షెవ్​చెంకో, కళాకారుడు.

ఆటోమొబైల్​​ వ్యర్థాలతో రూపొందించిన బల్లులు, ఈగలు, ఊసరవెల్లి వంటి ఆకృతులు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటి తయారీ కోసం వెండి, కాంస్య, రాగి ఖనిజాలను ఎంచుకుంటాడు షెవ్​చెంకో. కాప్రోనికెల్​ ఖనిజంతో తయారు చేసిన చెంచాలను పక్షుల తోక, రెక్కలు తయారుచేయడానికి ఉపయోగించాడు.

ఒక్క ఆకృతుని రూపొందించడానికి నెల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వస్తువులను ఎంతో చక్కగా తీర్చుదిద్దుతున్నాడు షెవ్​చెంకో. వ్యర్థాలతో తయారు చేసిన అద్భుత శిల్పాలను వీక్షకులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నెల 30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

ఇదీ చూడండి:- యోగా అవార్డు విజేతలకు మోదీ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details