తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్​ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

By

Published : Jun 27, 2019, 12:38 PM IST

Updated : Jun 27, 2019, 3:50 PM IST

జపాన్​ ప్రధానితో మోదీ భేటీ

జపాన్​ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒసాకాలో జరిగే జీ-20 సదస్సులో భాగంగా ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. రెండు దేశాల అధికారులతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రీవా శకం( మే1న జపాన్ చక్రవర్తి నరుహిటో సింహాసనం అధిష్టించిన రోజుతో మొదలైన శకం) ప్రారంభమైన అనంతరం ఇరువురి మధ్య ఇది తొలి సమావేశం.

అక్టోబర్‌లో జరిగే నరుహిటో చక్రవర్తి పట్టాభిషేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొంటారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రీవా శకం ప్రారంభం సందర్భంగా జపాన్​ ప్రజలకు అభినందనలు తెలిపారు.

షింజో అబేతో మోదీ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్​ కుమార్​ ట్వీట్​ చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే వార్షిక సదస్సుకు అబే భారత్​లో పర్యటించాలని మోదీ కోరినట్లు పేర్కొన్నారు.

జపాన్​ ప్రధానితో మోదీ భేటీ

కీలక అంశాలపై చర్చ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశం వీడిన ఆర్థిక నేరస్థులు, విపత్తు నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై మోదీ, ఒబే చర్చించారు. అక్టోబరులో జరిగే రాజు నరుహిటో పట్టాభిషేక వేడుకకు భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హాజరవుతారని ఒబేకు తెలిపారు మోదీ.

మోదీకి అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టినందుకు మోదీకి షింజో అబే అభినందనలు తెలిపారు. త్వరలోనే భారత్​లో పర్యటిస్తానని చెప్పారు.

జపాన్​ ప్రధానితో మోదీ భేటీ

ఇదీ చూడండి: జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Jun 27, 2019, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details