తెలంగాణ

telangana

ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు..!

ఇమ్రాన్​​ ఖాన్​ ప్రభుత్వానికి మరో చిక్కు ఎదురైంది. భారత్​ నుంచి దిగుమతులు నిలిచిపోయిన నేపథ్యంలో పాక్​లో టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా ఇరాన్​ నుంచి టమాటాలు దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది పాక్​.

By

Published : Nov 13, 2019, 8:51 PM IST

Published : Nov 13, 2019, 8:51 PM IST

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు..!

పాకిస్థాన్​లో టమాటాల ధరలు ప్రజలకు చుక్కలను చూపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో టమాటాల ధర కిలో రూ.180 నుంచి రూ.300 వరకూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్​ నుంచి టమాటాలు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

'సింధు'పైనే ఆశలు

సింధు ప్రాంతం నుంచి మరికొన్ని వారాల్లో టమాటా, ఉల్లి పంటలు మార్కెట్​లోకి వస్తాయని పాక్ భావిస్తోంది. అప్పటి వరకు ఇరాన్​ దిగుమతులతో నెట్టుకురావచ్చని ఆలోచిస్తోంది.

కిలో రూ.17కే!...

ఓ వైపు టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పాక్ ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్ షేక్​ మాత్రం భిన్నవాదన వినిపిస్తున్నారు. కరాచీ కూరగాయల మార్కెట్​లో టమాటాలు రూ.17ల కన్నా తక్కువకే దొరుకుతున్నాయని సెలవిచ్చారు. అయితే ధరలు పెరిగిపోతున్నాయంటూ ప్రజలు అబద్ధాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

స్వయంకృత అపరాధం

జమ్ము కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్​తో వ్యాపార సంబంధాలను పాకిస్థాన్ తెంచుకుంది. ఫలితంగా భారత్​ నుంచి పాక్​కు టమాటా దిగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది.

ఇదీ చూడండి:అక్టోబర్​లో 4.62 శాతానికి రిటైల్​ ద్రవ్యోల్బణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details