తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2019, 6:34 PM IST

ETV Bharat / international

'పాక్​ జెట్​ను కూల్చింది అభినందనుడే'

పాకిస్థాన్​ వాయుసేనకు చెందిన ఎఫ్​-16 విమానాన్ని మిగ్​-21 సాయంతో అభినందన్​ వర్ధమాన్​ కూల్చారని భారత విదేశాంగ స్పష్టంచేసింది. ఇందుకు ఎలక్ట్రానిక్​ ఆధారాలు ఉన్నట్లు తేల్చిచెప్పింది.

''పాక్ కచ్చితంగా​ ఎఫ్​-16 యుద్ధవిమానాలనే వాడింది''

భారత్​పై దాడికి అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్​-16లను పాకిస్థాన్​ ఉపయోగించిందని స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్​ కుమార్​. దిల్లీ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... కొనుగోలు నిబంధనలను ఈ చర్య ఉల్లఘించిందా? లేదా? అనేది పరీక్షించాలని అమెరికాను కోరినట్లు తెలిపారు. పాకిస్థాన్​ ఎఫ్​-16లను ఉపయోగించినట్లు అంగీకరించకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

''పాక్ కచ్చితంగా​ ఎఫ్​-16 యుద్ధవిమానాలనే వాడింది''

పాకిస్థాన్​ భారత్​పై దాడికి ఎఫ్​-16లను ఉపయోగించినట్లు ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎలక్ట్రానిక్​ ఆధారాలున్నాయి. ఒక ఎఫ్​-16ను వింగ్​ కమాండర్​ అభినందన్​ కూల్చివేశారు. ఎఫ్​-16 మాత్రమే సంధించగల ఆమ్రా క్షిపణి శకలాలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియాకు అందించాం.
- రవీష్​కుమార్​, విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి

పుల్వామా దాడి నుంచి అంతర్జాతీయ సమాజం భారత్​ వైపే ఉందని అన్నారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని కూడా వివిధ దేశాలు పాకిస్థాన్​ను కోరినట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమతి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని, ఇందులో జైషే మహ్మద్​​ పుల్వామా దాడికి బాధ్యులని ప్రకటించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details