తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2020, 5:47 PM IST

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 27లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రాణాంతక కరోనా వైరస్​ ధాటికి ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. సింగపూర్​లో 1037 మంది విదేశీ కార్మికులకు వైరస్ సోకగా, ఇందులో అత్యధికంగా భారతీయ కార్మికులే ఉన్నట్లు ఆ దేశాధికారులు వెల్లడించారు. స్పెయిన్​లో 24 గంటల్లో 440 మృతి చెందారు.

Over 1,000 more foreign workers in Singapore test positive for COVID-19
ప్రపంచవ్యాప్తంగా 27లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది​. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల 58 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. దాదాపు లక్షా 85వేల మందిని మహమ్మారి బలితీసుకుంది. ప్రాణాంతక వైరస్​ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7లక్షల 30 వేలకు చేరింది.

దేశాల వారిగా కరోనా కేసులు

స్పెయిన్​లో 22వేల మరణాలు

స్పెయిన్​లో గత రెండు రోజుల నుంచి కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో మరో 440 మంది మరణించినట్లు ఆ దేశ యంత్రాంగం తెలిపింది. దీంతో మొత్తం 22,157మంది కొవిడ్​-19తో మృతి చెందారు. ఇప్పటివరకు 2 లక్షల 13వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

సింగపూర్​లో వెయ్యి మందికి కరోనా

సింగపూర్​లో గురువారం మరో 1037 మంది విదేశీ కార్మికులకు కరోనా సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. వీరిలో వేయ్యి మందికి పైగా భారతీయ కార్మికులున్నట్లు తెలిపారు.

పాకిస్థాన్​ 10వేలు దాటిన కేసులు

పొరుగుదేశం పాకిస్థాన్​లో తాజాగా 745 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 10వేలు దాటాయి. మరో 15 మంది మృతి చెందారు. మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పాక్​ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) నుంచి 1.39 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా సాయం

చైనాలో ఇవాళ మరో 27 వ్యాధి లక్షణ రహిత కేసులు నమోదయ్యాయి. దీంతో చైనాలో కరోనా కేసులు సంఖ్య 984 చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులు నిలిపివేసినందున.. డబ్ల్యూహెచ్​ఓకు అదనంగా మరో 30 మిలియన్​ డాలర్లను ఇస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు.

న్యూజిలాండ్​లో..

న్యూజిలాండ్​లో గడిచిన 24 గంటల్లో కేవలం మూడు కొత్త కేసులు నమోదైనట్లు అధికారుల తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,451కి చేరింది. అంతేకాకుండా మరో ఇద్దరు మరణించగా, ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.

బెల్జియంలోనూ కేసుల పెరుగుదల

బెల్జియంలో కరోనా ధాటికి తాజాగా మరో 228 మంది మృతి చెందారు. ఇవాళ 908 మందికి వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

మెక్సికోలో

మెక్సికోలో గురువారం వెయ్యి మందికి పైగా కరోనా సోకినట్లు తెలిపారు. మరో 100 మందికి పైగా వైరస్​ బారిన పడి మరణించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details