తెలంగాణ

telangana

ETV Bharat / international

35కు చేరిన నేపాల్ తుఫాన్ మృతుల సంఖ్య!

నేపాల్​ తుఫాన్​ మృతుల సంఖ్య 35 కు పెరిగింది. సోమవారం ఉదయానికి 25 మంది మృతి చెందగా... తాజాగా మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Apr 1, 2019, 4:41 PM IST

35కు చేరిన నేపాల్ తుఫాన్ మృతుల సంఖ్య

35కు చేరిన నేపాల్ తుఫాన్ మృతుల సంఖ్య
నేపాల్​ ను ముంచెత్తిన తుఫాన్ మరో 10 మందిని బలిగొంది. దీంతో మృతుల సంఖ్య 35 కు చేరింది. ఆదివారం రాత్రి ఉగ్రరూపం దాల్చిన తుఫాన్​ ధాటికి 25 మంది మృతి చెందారు. తాజాగా మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఎక్కువమంది గోడలు కూలి, ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు కూలి, చెట్లు, విద్యుత్​ స్తంభాలు మీదపడి చనిపోయారు. సోమవారం ఉదయం తుఫాన్​ తీవ్రత తగ్గినందున హెలికాఫ్టర్ల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

వేగంగా వీచిన గాలుల ప్రభావంతో హైవేపై ఉన్న కార్లు, 40 మందితో వెళ్తున్న బస్సు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బారా, పర్శా జిల్లాలపై తుఫాన్​ తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు ప్రకటించారు.

ఈ తుఫాన్​లో మొత్తం 400 మందికి గాయాలైనట్లు ప్రధాని కేపీ శర్మ ఓలి ట్విట్టర్​లో ప్రకటించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details