తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ను ముంచెత్తిన వరదలు..28 మంది మృతి

పాకిస్థాన్​లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు 28 మంది మృత్యువాత పడ్డారు. ఖైబర్​ పంఖ్తుఖ్వా, కరాచీ ప్రాంతాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది.

By

Published : Aug 12, 2019, 9:02 AM IST

Updated : Sep 26, 2019, 5:39 PM IST

పాకిస్థాన్​

పాకిస్థాన్​ను ముంచెత్తిన వరదలు

రుతుపవనాల కారణంగా పాకిస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల ధాటికి 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఖైబర్​ పంఖ్తుఖ్వా రాష్ట్రంలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడి 12 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. చిత్రాల్​ జిల్లాలో చైనా ఇంజినీర్లు పని చేస్తున్న లవారి సొరంగం పూర్తిగా మునిగిపోయింది. వారిని సురక్షితంగా బయటికి తీశారు. కోహిస్థాన్​ జిల్లా సింధు నదిలో వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

కరాచీలో రెండు రోజులుగా 150 మి.మీ. వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 10 మంది మృత్యువాత పడ్డారు. 1992 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని పాక్ వాతావరణ శాఖ తెలిపింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడిండి: చైనాలో 'లేకిమా' బీభత్సం-33కు చేరిన మృతులు

Last Updated : Sep 26, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details