తెలంగాణ

telangana

ETV Bharat / international

నిస్సాన్​ మాజీ సీఈఓ కార్లోస్​​కు బెయిల్​

ఆర్థిక అవకతవకల ఆరోపణలతో అరెస్టయిన నిస్సాన్ మాజీ​ సీఈఓ కార్లోస్‌ ఘోస్న్‌కు జపాన్​ కోర్టు 4.5 మిలియన్​ డాలర్ల పూచీకత్తుతో బెయిల్​ మంజూరు చేసింది.  టోక్యోలోని నిర్బంధ కేంద్రం నుంచి నేడు విడుదల కానున్నారు ఘోస్న్​.

By

Published : Apr 25, 2019, 3:34 PM IST

నిస్సాన్​ మాజీ సీఈఓ కార్లోస్​​కు బెయిల్​

నిస్సాన్​ సంస్థలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని నాలుగు కేసులు ఎదుర్కొంటొన్న ఆ సంస్థ మాజీ సీఈఓ కార్లోస్​ ఘోస్న్​కు ఊరట లభించింది. 4.5 మిలియన్​ డాలర్ల పూచీకత్తుతో బెయిల్​ మంజూరు చేసింది టోక్యో జిల్లా కోర్టు. నేడు నిర్బంధ కేంద్రం నుంచి విడుదల కానున్నారు.

ఆర్థిక అవకతవకల ఆరోపణలు..

కార్లోస్​ ఘోస్న్​ గతంలో నిస్సాన్, రెనో, మిత్సుబిషీ మోటార్స్​ల ఉమ్మడి సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఆయన సీఈఓగా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒమన్​లో డీలర్​షిప్​ కోసం సుమారు 5 మిలియన్​ డాలర్లు నగదు నిస్సాన్​ సంస్థ నుంచి బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో వ్యక్తిగతంగా నష్టపోయిన నగదును సంస్థ నష్టాలుగా చూపించారని మరో రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మొదటిసారిగా నవంబర్​ 2018లో ఆయన్ను అరెస్టు చేశారు. ఫలితంగా సీఈఓ పదవి నుంచి ఘోస్న్​ను తప్పించింది ఆటోమొబైల్​ దిగ్గజం నిస్సాన్.

ABOUT THE AUTHOR

...view details