తెలంగాణ

telangana

ETV Bharat / international

యూఏఈ లాటరీలో 28కోట్లు గెలిచిన భారతీయుడు

ప్రవాస భారతీయుడు షోజిత్ కేఎస్​కు భారీ దుబాయ్​ లాటరీ తగిలింది. సుమారుగా రూ.28 కోట్ల 25 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఈ విషయం అతనికి ఇంకా తెలియకపోవడం గమనార్హం.

By

Published : May 4, 2019, 5:31 PM IST

యూఏఈ లాటరీలో 28కోట్లు గెలిచిన భారతీయుడు

యూఏఈలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు అదృష్టం కలిసొచ్చి భారీ జాక్​పాట్ కొట్టాడు. అబుదాబిలో తీసిన ఓ లాటరీలో అతను 15 మిలియన్​ దిర్హమ్​లు (సుమారుగా రూ.28 కోట్ల 25 లక్షలు) గెలుచుకున్నాడు. అయితే ఈ విషయం అతనికి ఇప్పటికీ తెలియకపోవడం విశేషం.

అబుదాబి డ్యూటీ ఫ్రీస్ బిగ్​ టికెట్​ సిరీస్​ డ్రాను శుక్రవారం యూట్యూబ్​లో లైవ్​స్ట్రీమ్​ చేశారు. ఈ డ్రాలో షార్జాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు షోజిత్​ కేఎస్... రూ.28కోట్ల 25లక్షల 17వేల 500లు​ గెలుచుకున్నాడు. ఇలా దుబాయ్​లో లాటరీ గెలుచుకున్న భారతీయుల జాబితాలో చేరాడు.

గతేడాది కేరళకు చెందిన డ్రైవర్​ జాన్​ వర్గీస్​ 12 మిలియన్ దిర్హమ్​లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

తనకు ఇంకా తెలియదు...

షోజిత్​ ఏప్రిల్​ 1న ఈ లాటరీ టికెట్​ను కొన్నాడు. అయితే తాజాగా తీసిన డ్రాలో అదృష్టం కలిసి వచ్చినట్లు అతనికి ఇంకా తెలియదు. అందుకే అధికారులు అతనికి పదేపదే ఫోన్​ చేస్తున్నా, స్పందించడం లేదు. అయితే షోజిత్ చిరునామా తమకు తెలుసునని, అతనికి స్వయంగా ఈ లాటరీ సొమ్ము అందిస్తామని సదరు లాటరీ సంస్థ తెలిపింది.

ఇదే లాటరీలో మరో ప్రవాస భారతీయుడు మంగేశ్​ మెయిన్డే... 'బీఎమ్​డబ్ల్యూ 220ఐ' గెలుపొందాడు. మరో 8 మంది భారతీయులు, ఓ పాకిస్థానీ కన్సోలేషన్​ బహుమతులు పొందారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా ఇలా లాటరీ తీస్తుంటారు.

ఇదీ చూడండి: బిట్​కాయిన్​ తరహాలో ఫేస్​బుక్​ కొత్త కరెన్సీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details