తెలంగాణ

telangana

By

Published : Aug 7, 2019, 7:11 AM IST

Updated : Aug 7, 2019, 9:00 AM IST

ETV Bharat / international

హాంకాంగ్​లో చెలరేగుతున్న నిరసనలు

నేరస్థుల అప్పగింత బిల్లుకు సంబంధించి హాంకాంగ్​లో రోజురోజుకూ నిరసనకారుల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉద్రిక్తత మరింత తీవ్రరూపం దాల్చింది. ఆందోళనలు చేపట్టిన నిరసనకారులపైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

హాంకాంగ్​లో చెలరేగుతున్న నిరసనలు

హాంకాంగ్​లో రోజు రోజుకు నిరసనకారుల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా 9 వారాల క్రితం మొదలైన ఆందోళనలు మంగళవారం తీవ్రరూపం దాల్చాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో మాత్రమే నిరసనల్లో పాల్గొంటారు హాంకాంగ్​ వాసులు. కానీ, మంగళవారం సైతం రహదారులపైకి వచ్చారు. రాత్రివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. పోలీస్​ స్టేషన్లను కూడా ముట్టడించారు.

చైనా మద్దతుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించారు నిరసన కారులు. కొందరు పొడవాటి కర్రలతో ఆందోళనకారులపై దాడికి దిగడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక లాభం లేక పోలీసులు నిరసనకారులపైకి బాష్పవాయవు గోళాలు, రబ్బరు​ బుల్లెట్లను ప్రయోగించారు. 148 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:తీవ్ర నీటి సంక్షోభం దిశగా భారత్..​

Last Updated : Aug 7, 2019, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details