తెలంగాణ

telangana

ETV Bharat / international

తలొగ్గిన హాంగ్​కాంగ్​ సర్కార్- 'చైనా బిల్లు' రద్దు!

మూడు నెలలుగా తీవ్ర ఆందోళనలకు కారణమైన.. "చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లు"ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది హాంగ్​కాంగ్​ ప్రభుత్వం. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా నిర్ణయాన్ని వెల్లడించారు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్​.

By

Published : Sep 4, 2019, 5:44 PM IST

Updated : Sep 29, 2019, 10:41 AM IST

తలొగ్గిన హాంగ్​కాంగ్​ ప్రభుత్వం- 'చైనా బిల్లు' రద్దు!

చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుపై ప్రజల నిరసనలకు తలొగ్గింది హాంగ్​కాంగ్ ప్రభుత్వం. ఎట్టకేలకు చైనా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆందోళనకారుల 5 ప్రధాన డిమాండ్లలో ఒకటైనా బిల్లు రద్దుపై వీడియో సందేశం ద్వారా నిర్ణయం వెలువరించారు హాంగ్​కాంగ్​ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్​.

" ప్రజల నిరసనలకు తెరదించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బిల్లును ఉపసహరించుకుంటోంది."

-కారీ లామ్​.

భారీ స్థాయిలో నిరసనలు

హాంగ్​కాంగ్​పై చైనా పెత్తనాన్ని నిరసిస్తూ గత జూన్​ నెల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. వేల మంది వీధుల్లోకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న క్రమంలో వందల మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో అరెస్టయ్యారు.

మార్కెట్ల సానుకూలత..

తాజాగా కారీ లామ్​ ప్రకటన ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సద్దుమణిగేలా చేస్తుందన్న వార్తలతో ఆ దేశ స్టాక్​ మార్కెట్లు సుమారు 4 శాతం ఎగబాకాయి.

ఆందోళనకారుల్లో వ్యతిరేకత..

ప్రభుత్వ నిర్ణయాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. చాలా ఆలస్యంగా చిన్న నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. దీనిద్వారా నిరసనలు ఆగవని స్పష్టం చేశారు. హాంగ్​కాంగ్​కు చైనా నుంచి విముక్తి కల్పించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. సార్వత్రిక ఓటు హక్కు, అదుపులోకి తీసుకున్న నిరసనకారుల విడుదల, దాడులకు పాల్పడిన పోలీసులపై విచారణ వంటి డిమాండ్ల కోసం నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: అత్యంత నివాసయోగ్య నగరాల్లో భారత్​లో పరిస్థితి ఇదీ..

Last Updated : Sep 29, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details