తెలంగాణ

telangana

ETV Bharat / international

మాల్దీవుల ఎన్నికల్లో 'నషీద్'​ పార్టీ విజయం

మాల్దీవులు ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్​​ నేతృత్వంలోని మాల్దీవియన్​ డెమొక్రటిక్​ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించింది. పలు ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిన ఆయన... తిరిగొచ్చిన 5 నెలల్లోనే ఈ ఘన విజయం సొంతం చేసుకున్నారు.

By

Published : Apr 8, 2019, 6:42 AM IST

నషీద్

మాల్దీవుల ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్​ నేతృత్వంలోని ఎండీపీ​ ఘనవిజయం సాధించింది.పలు అభియోగాలతో విదేశాల్లో ఉండి... దేశానికి తిరిగి వచ్చిన 5 నెలల్లోనే తిరిగి జాతీయ పార్లమెంట్​లోకి నాటకీయంగా తిరిగొచ్చారు. 87 మంది ఉన్న అసెంబ్లీలో నషీద్ నేతృత్వంలోని మాల్దీవియన్​ డెమోక్రటిక్​ పార్టీ(ఎండీపీ) 60 సీట్లు దక్కించుకుంది.

మాల్దీవుల్లో పోలింగ్​ శనివారం జరిగింది.

నషీద్​కు వచ్చిన అఖండ మెజార్టీతో ఆయన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామిన్​కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆయన నేతృత్వంలోని ప్రోగ్రెసివ్​ పార్టీ ఆఫ్​ మాల్దీవ్స్ 4 సీట్లు మాత్రమే దక్కించుకుంది.

మాల్దీవులకు తమ పార్టీ స్థిరమైన పాలనను తీసుకువస్తుందని నషీద్​ తెలిపారు. దేశంలో సంస్కరణలు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందిస్తానని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details