తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​

అమెరికా దిగుమతులపై భారత్​ పెంచిన సుంకాలు తగ్గించాల్సిందేనని పేర్కొన్న ఒకరోజు వ్యవధిలోనే మెత్తబడ్డారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. జపాన్​లో మోదీతో భేటీ సందర్భంగా వాణిజ్యపరంగా నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకరించారు.

By

Published : Jun 28, 2019, 12:50 PM IST

Updated : Jun 28, 2019, 3:22 PM IST

మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​

మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్​

అమెరికా ఉత్పత్తులపై పెంచిన సుంకాలను భారత్ తగ్గించాల్సిందేనని హెచ్చరించిన ఒక్క రోజు వ్యవధిలోనే వెనక్కి తగ్గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. జపాన్​లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. వాణిజ్య పరంగా నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకరించారు.

జీ-20 సదస్సుకు బయలుదేరేముందు భారత్​ను హెచ్చరిస్తూ ట్వీట్​ చేశారు ట్రంప్​. అమెరికా దిగుమతులపై భారత్​ పెంచిన సుంకాలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. భారత్​ అధిక సుంకాలు వసూలు చేయడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

ఇరు దేశాధినేతల భేటీపై పలు అంశాలను వెల్లడించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్​ గోఖలే.

"భారత్​కు 'సాధారణ ప్రాధాన్య దేశం'(జీఎస్​పీ) కింద ఇచ్చే హోదా రద్దు చేసిన అనంతరం మేము కొన్ని చర్యలు తీసుకున్నామని ప్రధాని ప్రస్తావించారు. ఆ​ చర్యలు ఇప్పటికే జరిగిపోయిన అంశమని తెలిపారు. ప్రస్తుతం భవిష్యత్తు కార్యచరణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ సమస్యలను ఏవింధంగా పరిష్కరించాలనేది మనం ఆలోచించాలని ట్రంప్​తో ప్రధాని చెప్పారు. ఈ ఆలోచనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ అంగీకారం తెలిపారు."
- విజయ్​ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి.

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికారం చేప్పటినందుకు మోదీకి అభినందనలు తెలిపారు ట్రంప్​. రక్షణ రంగంతో పాటు పలు కీలక అంశాల్లో భారత్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: జీ-20: మోదీ-ట్రంప్​ '5జీ' స్నేహగీతం

Last Updated : Jun 28, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details