తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వేళ మాల్దీవులకు భారత్​ బాసట

కరోనాపై పోరులో భాగంగా ద్వీప దేశమైన మాల్దీవులకు మద్దతుగా నిలిచింది భారత్​. ఇరుదేశాల మధ్య గతేడాది జరిగిన ఒప్పందంలో భాగంగా 150 మిలియన్ల అమెరికా​ డాలర్లను నగదు రూపంలో అందజేసింది.

By

Published : Apr 29, 2020, 12:02 AM IST

India extends USD 150 million foreign currency swap support to Maldives
కరోనా వేళ మాల్దీవులకు భారత్​ బాసట

హిందూ మహాసముద్రంలో కీలకమైన ద్వీపదేశమైన మాల్దీవులకు బాసటగా నిలిచింది భారత్. 150 మిలియన్ అమెరికన్ డాలర్లను నగదు రూపంలో అందించింది. 400మిలియన్ అమెరికన్ డాలర్లను మారకం పద్ధతిలో అందించేందుకు గతేడాది జూన్​లో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ఈ ఒప్పందంలో భాగంగా తాజాగా 150 మిలియన్ అమెరికా​ డాలర్లను అందించింది.

కరోనా వేళ మాల్దీవులకు భారత్​ బాసట

"భారత్ 150మిలియన్ డాలర్ల కరెన్సీని నగదు రూపంలో మాల్దీవులకు అందించింది. జులై 2019లో కుదిరిన ఒప్పందం మేరకు అమెరికా కరెన్సీని అందించింది. కరోనా వేళ సాయం అందించేందుకే ఈ సాయం చేసింది."

-మాల్దీవుల్లో భారత రాయబారి ప్రకటన

ఇదీ చదవండి:'కరోనా కట్టడికి ఆ రెండే ప్రధాన అస్త్రాలు'

ABOUT THE AUTHOR

...view details