తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధం వస్తే భారత్​కు ఓటమి తప్పదు: చైనా

సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేసింది చైనా. యుద్ధం వస్తే భారత్​కు గెలిచే అవకాశమే లేదని పేర్కొంది. భారత్​ కన్నా ఎంతో బలమైన సైనిక శక్తి చైనా సొంతమని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు రక్షణ మంత్రుల భేటీ కీలకంగా మారుతుందని నమ్ముతున్నట్లు పేర్కొంది.

By

Published : Sep 6, 2020, 5:26 AM IST

Updated : Sep 6, 2020, 9:50 AM IST

India has no chance of winning war
యుద్ధం వస్తే భారత్​కు ఓటమి తప్పదు: చైనా

భారత్​-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఓ వైపు శాంతి మంత్రి జపిస్తూనే.. మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంది చైనా. రష్యా వేదికగా ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీని కీలక ముందడుగుగా పేర్కొంటూనే.. భారత్​ను హెచ్చరించే ప్రయత్నం చేసింది చైనా అధికారిక మీడియా. సరిహద్దులో యుద్ధం వస్తే.. భారత్​కు గెలిచే అవకాశమే లేదని, ఓటమి తప్పదని పేర్కొంది.

చైనా కమ్యూనిస్ట్​ పార్టీ అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ ఈ మేరకు కథనం ప్రచురించింది.

"భారత్​ కన్నా ఎంతో బలమైన సైనిక శక్తితో పాటు చైనా బలాన్ని భారత్​కు మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. పోరాట సామర్థ్యం విషయానికి వస్తే భారత్​ వెనుకంజలో ఉంటుంది. ఇరు దేశాలు శక్తిమంతమైనవే, కానీ.. ఒకవేళ సరిహద్దు యుద్ధం తలెత్తితే.. భారత్​కు గెలిచే అవకాశమే లేదు. ఇరు దేశాలు గతంలో కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండేందుకు రక్షణ మంత్రుల సమావేశం కీలకంగా మారుతుందని నమ్ముతున్నాం. సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండువైపులా ప్రయత్నాలు చేయాలి. సరిహద్దులపై భారత విధానాలు జాతీయత, ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనాతో పాటు జాతీయత, ప్రజల అభిప్రాయాలను మెప్పించాలి. దేశం, ప్రజల కోసం సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉంది. "

- గ్లోబల్​ టైమ్స్​, కథనం.

సరిహద్దు సమస్యను పెంచే విధంగా భారత్ వ్యవహరిస్తోందని ఆరోపించింది మీడియా. సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలనే చైనా వైఖరిని వక్రీకరిస్తూ.. తప్పుగా వ్యాఖ్యానిస్తోందని, యుద్ధం చేసేందుకైనా సిద్ధమంటూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. చైనాని అణచివేస్తూ భారత్​కు అమెరికా మద్దతు పలకటం ఆ దేశ వ్యూహాత్మక బలాన్ని పెంచుతుందని కొందరు భావిస్తున్నారని, అలాంటి తప్పుడు లెక్కలతో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇదీ చూడండి: చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్​నాథ్​

Last Updated : Sep 6, 2020, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details