తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2020, 5:08 AM IST

Updated : Feb 28, 2020, 11:36 AM IST

ETV Bharat / international

డ్రాగన్​ను మింగేస్తున్న కరోనా.. 170కి చేరిన మృతులు

China virus dead toll rises to 169, more than 1,000 new cases
చైనాలో కరుణించని కరోనా... ఒక్కరోజే 37 మంది మృతి

05:40 January 30

చైనాలో కరుణించని కరోనా... ఒక్కరోజే 37 మంది మృతి

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్​తో రోజురోజుకు మృత్యుఘోష పెరుగుతూ పోతోంది.​ ఈ వైరస్​ బారిన పడి తాజాగా మరో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా డ్రాగన్​ దేశంలో కరోనా మృతుల సంఖ్య 170కి చేరింది. ఇప్పటికే 6 వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా కొత్తగా మరో 1,032 కేసులను గుర్తించినట్లు చైనా ఆరోగ్య శాఖ​ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రాగన్​లో ఈ వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 7,711కు చేరింది.

చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 17 దేశాలకు కరోనా వైరస్ విస్తరించగా సుమారు 60 వేల మంది వైద్య పరిశీలనలో ఉన్నారు.  వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగం పాలు పంచుకోవాలని చైనా సైన్యానికి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించారు. మరోవైపు విదేశీయులను సొంత దేశాలకు పంపించేందుకు సహకరిస్తామని ప్రకటించారు. 
 

05:05 January 30

డ్రాగన్​ను మింగేస్తున్న కరోనా.. 170కి చేరిన మృతులు

ప్రాణాంతక కరోనా వైరస్​తో చైనాలో మరో 37 మంది మరణించారు. ఫలితంగా డ్రాగన్​ దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 169కి చేరింది. కొత్తగా మరో 1000 మందికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 7,711 మందికి ఈ వైరస్​ సోకినట్లు గుర్తించారు. 

Last Updated : Feb 28, 2020, 11:36 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details