తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్ నిరసనకారులపై డ్రాగన్ కన్నెర్ర

హాంకాంగ్​ నిరసనకారులు విమానాశ్రయంలో ఇద్దరు చైనా పౌరులపై దాడిచేశారు. ఈ చర్యను​ ఖండించిన చైనా ఆందోళనకారులు ఉగ్రవాద తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్​​ సరిహద్దులకు తన సైనిక దళాలను తరలించింది. డ్రాగన్​ చర్యపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

By

Published : Aug 15, 2019, 6:34 AM IST

Updated : Sep 27, 2019, 1:44 AM IST

హాంకాంగ్ నిరసనకారులపై డ్రాగన్ కన్నెర్ర

హాంకాంగ్ నిరసనకారులపై డ్రాగన్ కన్నెర్ర

హాంకాంగ్​ నిరసనకారులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని తమ దేశ పౌరులపై 'ఉగ్రవాద తరహా' దాడులకు పాల్పడ్డారంటూ ఆక్రోశం ప్రదర్శించింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఇప్పటికే హాంకాంగ్ సరిహద్దుల్లో తన సేనలను మోహరించింది చైనా. డ్రాగన్​ చర్యపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 'చైనాకు ఖైదీల అప్పగింత బిల్లు'ను వ్యతిరేకిస్తూ హాం​కాంగ్​ పౌరులు చేస్తున్న నిరసనలకు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది.

నిరసనకారులు రెండు రోజుల పాటు హాంగ్​కాంగ్​ విమానాశ్రయాన్ని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. ఫలితంగా చాలా విమానసర్వీసులను అధికారులు నిలిపివేశారు. చివరకు ఆందోళనకారులు ఇద్దరు చైనా పౌరులను చితకబాదారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను నిలువరించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ అంశంపై పాక్ ప్రధాని అక్కసు

Last Updated : Sep 27, 2019, 1:44 AM IST

ABOUT THE AUTHOR

...view details