తెలంగాణ

telangana

ETV Bharat / international

కర్తార్​పుర్​పై చర్చలకు రావాలని పాక్​కు భారత్​ సూచన

కర్తార్​పుర్​ నడవా విషయంలో మరోసారి సాంకేతిక స్థాయి చర్చల్ని నిర్వహించాలని పాకిస్థాన్​కు భారత్​ సూచించింది. నడవా ఏర్పాట్లపై పాక్​ స్పందించని నేపథ్యంలో భారత్​ మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేసింది.

By

Published : Aug 11, 2019, 7:43 AM IST

కర్తార్​పుర్​పై చర్చలకు రావాలని పాక్​కు భారత్​ సూచన

కశ్మీర్​ పరిణామాలతో కర్తార్​పుర్​ నడవాపై ఎలాంటి ప్రభావం పడకూడదని భారత్​ భావిస్తోంది. నడవా ఏర్పాట్లపై పాకిస్థాన్​ స్పందించని కారణంగా భారత ప్రభుత్వం మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది.

కర్తార్​పుర్ నడవాపై ఆగస్టు మొదటివారంలో సాంకేతిక స్థాయి చర్చలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయంపై పాక్​కు సూచించింది భారత్. కానీ పొరుగు దేశం​ నుంచి సమాధానం లేకపోవటం వల్ల ఆ దేశానికి భారత్​ నోటీసు పంపించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు

⦁ కర్తార్‌పూర్ నడవాకు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేయడం.

⦁ నోడల్ పాయింట్ల మధ్య యాత్రికుల సమాచారం పరస్పర మార్పిడికి తగిన యంత్రాంగం.

⦁ మార్గాన్ని ఉపయోగించేటప్పుడు అత్యవసర యంత్రాంగం ఏర్పాటు.

ఇప్పటివరకు జరిగిన చర్చల్లో అనేక విషయాలపై ఇరు దేశాలు చర్చించాయి. భారత్​ ప్రతిపాదించిన చాలా అంశాలను పాక్​ అంగీకరించింది.

సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీవితంలో చివరి రోజులు గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో గడిపారు. ఆయన 550వ జయంతి ఉత్సవాలు ఈ ఏడాది జరుగుతాయి. భారత దేశంలోని సిక్కులు పాకిస్థాన్‌లో ఉన్న ఈ పవిత్ర స్థలానికి వెళ్తారు. నవంబరులో ఈ నడవాను తెరవాల్సి ఉంది. పాకిస్థాన్‌ పంజాబ్​లోని నరోవల్ జిల్లాలో కర్తార్‌పుర్ గురుద్వారా ఉంది.

ఇదీ చూడండి:'యే దోస్తీ' పాటతో ఇజ్రాయెల్​ ఫ్రెండ్​షిప్​ డే విషెష్​

ABOUT THE AUTHOR

...view details