తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​లో​ భారీ వర్షాలు- 17 మంది బలి

నేపాల్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, భారీ వానలకు కొండచరియలు విరిగిపడి..17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గల్లంతైనట్లు నేపాల్ హోంశాఖ వెల్లడించింది.

By

Published : Jul 13, 2019, 6:35 AM IST

Updated : Jul 13, 2019, 8:25 AM IST

నేపాల్​లో భారీ వర్షాలు

నేపాల్​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయాలపాలయ్యారు.

దేశ రాజధాని కాఠ్మాండులోని ముల్పని ప్రాంతంలో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నేపాల్‌లోని అన్ని ప్రధాన రహదారులపై నీరు నిలిచి రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

ప్రాథమిక నివేదిక ప్రకారం మోరాంగ్​లోని 400, బారాలోని 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Last Updated : Jul 13, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details