తెలంగాణ

telangana

చైనాపై 'లేకిమా' ప్రతాపం- 13 మంది మృతి

చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లేకిమా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు 13 మంది మృతి చెందారు. 16 మంది గల్లంతయ్యారు. సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

By

Published : Aug 10, 2019, 3:34 PM IST

Published : Aug 10, 2019, 3:34 PM IST

చైనాను వణికిస్తున్న లేకిమా తుపాను-13 మంది మృతి

చైనాను వణికిస్తున్న లేకిమా తుపాను-13 మంది మృతి
చైనాను లేకిమా తుపాను వణికిస్తోంది. భారీ వర్షాల ధాటికి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు.

జెజియాంగ్, జియాంగ్సు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా షాంఘై డిస్నీల్యాండ్ మూతపడింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. 1000 మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాలు సహా 150 అగ్నిమాపక యంత్రాలు, 153 పడవల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సుమారు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జెజియాంగ్ రాష్ట్రంలో 288 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్లను నిలిపేశారు.

ఇదీ చూడండి: మయన్మార్​: కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details